తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న రైతు భరోసా పథకం కోసం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు రూ.2223 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే.. ఇప్పటికే ఎకరం సాగు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయగా.. ఇప్పుడు రెండెకరాలున్న అన్నదాతల అకౌంట్లలోని డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.