తెలంగాణ రైతులకు ఒకేసారి రెండు శుభవార్తలు అందాయి. ఈనెల 20న పీఎం కిసాన్ డబ్బులు పడనుండగా.. ఈనెల 30వ తేదీన రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. దీంతో ప్రస్తుతం వానాకాలం సీజన్లో పంట సాగు చేసే రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. ఈనెల 20న దేశవ్యాప్తంగా రైతులకు పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నట్లు కేంద్రం ప్రకటించగా.. తాజాగా రైతు భరోసా నిధుల విడుదల తేదీని తెలంగాణ కేబినెట్ ఖరారు చేసింది.