పంటల బీమాపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పంటల బీమా పథకంపై సమీక్ష నిర్వహించన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. వానాకాలం, యాసంగి పంటలకు బీమా వర్తింపజేయాలన్నారు. ఇతర రాష్ట్రాల అమలు విధానాలు అధ్యయనం చేయాలని ఆదేశించారు. వరి, మామిడి లాంటి ప్రధాన పంటలకు నష్టపరిహారం, సత్వర క్లెయిమ్ కోసం సాంకేతిక విధానాలు రూపొందించాలని సూచించారు.