తెలంగాణ రైతులకు గుడ్న్యూస్. రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద నేటి నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నిధుల విడుదలను ప్రారంభించనున్నారు. గతంలో 3.5 ఎకరాలకే పరిమితం కాగా.. ఇప్పుడు 10 ఎకరాల వరకు కూడా ఒకేసారి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. కొత్తగా అర్హత పొందిన రైతులకు నెలాఖరులోగా నిధులు అందుతాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.