తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఎన్నికల హామీ మేరకు.. వివాదాస్పద ధరణి పోర్టల్కు ప్రత్యామ్నాయంగా 'భూ భారతి' పోర్టల్ను అమలు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలుత మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి.. జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నట్టు సీఎంఓ ప్రకటించింది. ఈ పోర్టల్ ద్వారా భూ సమస్యల పరిష్కారం సులభతరం అవుతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది.