Tummala Nageswara Rao Good News To Oil Palm Farmers: తెలంగాణలో పామాయిల్ రైతులకు దీపావళి వెలుగులు రాబోతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలుగు ప్రజలకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం టన్ను ఆయిల్పామ్కు రూ.19 వేలకు పైగా ధర వస్తుందని చెప్పారు. పామాయిల్ సాగుతో ఆర్థిక పరిస్థితి మారుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆయిల్పామ్ రైతులు దేశానికి మార్గదర్శిగా నిలవాలని.. ఈ పంట సాగులో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు రావాలని ఆకాంక్షించారు.