తెలంగాణలోని అన్నదాతలకు రైతు భరోసా కింద.. రేవంత్ రెడ్డి సర్కార్ ఎకరాకు రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. ఈ క్రమంలో.. మొదటి దశలో ఇప్పటివరకు ఎకరం వరకు సాగు భూమి ఉన్న రైతులకు ఎకరాకు రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించింది. కాగా.. విడతలవారీగా అందిస్తోన్న ఈ రైతుభరోసా పథకంలో రేపటి నుంచి రెండు ఎకరాలున్న రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేయనున్నట్టు తెలుస్తోంది.