తెలంగాణలో స్థానికత అంశానికి సంబంధించి దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసింది. ఎవరైనా విద్యార్థి పదో తరగతి తర్వాత రెండేళ్లు బయట చదివితే నాన్-లోకల్గా పరిగణించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే, వీటిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిగింది. సొంత రాష్ట్రంలోని విద్యార్థుల హక్కులకు అన్యాయం జరిగేలా నిబంధనలు ఉండకూడదని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది. అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు కోర్టు తెలిపింది. దీంతో కోర్టు ఏం చెబుతుందోననే ఉత్కంఠ నెలకుంది.