కొన్ని రోజుల గ్యాప్ ఇచ్చిన వర్షం మళ్లీ దంచికొట్టడం ప్రారంభించింది. గురువారం నాడు రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. భారీ వర్షం వల్ల రోడ్లన్ని జలపాతం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఈక్రమంలో వాతవారణ శాఖ తెలంగాణకు కీలక అలర్ట్ జారీ చేసింది. నేటి నుంచి మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో కుండపోత వానలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆ వివరాలు..