తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్. ప్రస్తుతం మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్త వినిపించాడు తెలంగాణ వెదర్ మెన్. ఇంకో ఐదు రోజుల పాటు ఎండలు, వేడి గాలులతో ఇబ్బంది పడాల్సిందేనని.. ఆ తర్వాత ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపాడు. అయితే.. ఈ వర్షాలు సాధారణ జనాలకు కాస్త ఉపశమనం కలిగించినా.. రైతులకు మాత్రం ఇబ్బంది కలిగించే అవకాశం ఉండటంతో వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.