తెలంగాణలో ఈ ఏడాది వేసవి చాలా విచిత్రంగా ఉంది. తీవ్రమైన ఎండలు, వడదెబ్బ మరణాలు ఒకవైపు భయపెడుతుంటే.. మరోవైపు అకాల వర్షాలు, చల్లటి వాతావరణం ఉపశమనం కలిగిస్తున్నాయి. నేడు పలు జిల్లాలకు మోస్తరు వర్ష సూచనతో వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.