రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో జూలై 19 వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 30- 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. హైదరాబాద్లో వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ సాయంత్రం వేళల్లో వర్షం పడే అవకాశం ఉందన్నారు.