హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం 'రాజీవ్ యువ వికాసం' కింద ఆటోల రెట్రో ఫిటింగ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికోసం బడ్జెట్లో రూ. 200 కోట్లు కేటాయించింది. నగరంలోని 1.25 లక్షల పెట్రోల్, డీజిల్ ఆటోలను ఉచితంగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తారు. దీనివల్ల డ్రైవర్లకు ఇంధన ఖర్చులు తగ్గి, పర్యావరణానికి మేలు జరుగుతుంది.