తెలంగాణలో గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఓటర్ల జాబితాలు సిద్ధమయ్యాయి. మొత్తం 12,760 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయం కోసం ఎన్నికల సంఘం ఎదురుచూస్తోంది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వంపై ఒత్తిడి నెలకొంది.