తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. జులై చివరి నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల మధ్య 15 రోజుల వ్యవధి ఉండే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది, ప్రభుత్వం ప్రకటన వెలువరించడమే తరువాయి.