తెలంగాణ సచివాలయంలోకి సందర్శకుల నియంత్రణ, భద్రత పెంపు కోసం త్వరలో ఈ-పాస్ విధానం రానుంది. ఐటీ శాఖ రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా సందర్శకులకు క్యూఆర్ కోడ్ ఆధారిత పాస్లు జారీ చేయనున్నారు. ప్రతి మంత్రి, కార్యదర్శి పేషీకి యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉంటాయి. ప్రస్తుతం ట్రయల్ రన్లో ఉన్న ఈ విధానం ద్వారా సందర్శకుల వివరాలు, ప్రవేశ సమయం వంటివి GAD అధికారుల వద్ద నమోదవుతాయి.