తెలంగాణ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ మాటూరి గిరిజా ప్రియదర్శిని గారు ఆదివారం ఉదయం హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. ఆమె నిక్కచ్చిగా విధులు నిర్వర్తించేవారని, న్యాయమైన తీర్పులు వెలువరించేవారని న్యాయవాదులు గుర్తు చేసుకున్నారు. జస్టిస్ ప్రియదర్శిని జిల్లా జడ్జిగా పనిచేసిన సమయంలో న్యాయ సేవల సంస్థలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి.