తెలంగాణలోని జాతీయ రహదారులు కొత్త రూపును సంతరించుకోనున్నాయి. జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం రూ.825 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో NH-44, 163, 65పై 28.97 కి.మీ. మేర వంతెనలు, అండర్పాస్లు నిర్మిస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్నగర్, నల్గొండ, మేడ్చల్ పరిధిలో ఈ పనులు చేపట్టనున్నారు. ఘట్కేసర్లో ఫ్లైఓవర్, ఇతర చోట్ల అండర్పాస్లు, సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టులతో ట్రాఫిక్ సమస్య తగ్గి, ప్రయాణం సులభం కానుంది.