విపత్తులు, వరద సాయం కింద పలు రాష్ట్రాలకు కేంద్రం అదనపు నిధులు విడుదల చేసింది. ఐదు రాష్ట్రాలకు మొత్తం రూ. 1,554.99 కోట్లు రిలీజ్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా.. నాగాలాండ్, ఒడిషా, త్రిపుర రాష్ట్రాలకు వరద సాయం నిధులు విడుదల చేశారు. ఇందులో తెలంగాణకు రూ. 231 కోట్లు కేటాయించారు.