తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయంది. నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. బలమైన ఈదురు గాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు.