తెలంగాణ ప్రజలకు త్వరలోనే మరో గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమవుతోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ మేరకు అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్లో కొత్త ఎయిర్ పోర్టు ఏర్పాటు చేసే బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు. మొదటి దశలో వరంగల్కు విమానాశ్రయాన్ని తీసుకొచ్చానని.. రెండో దశలో ఆదిలాబాద్కు ఎయిర్ పోర్టు తీసుకురానున్నట్టు తెలిపారు.