తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక వరంగల్లో కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.