మహారాష్ట్ర మీదుగా ఉపరితల ఆవర్తనం, బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలుంటాయని హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు ప్రజలకు సూచించారు.