రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్ నుంచి కేరళ వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. 30 జిల్లాలకు అలర్ట్ ప్రకటించారు.