తెలంగాణలో రానున్న ఆరు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కర్ణాటక నుండి తమిళనాడు వరకు వ్యాపించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఏప్రిల్ 3 వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడవచ్చునని చెప్పింది. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, వడగళ్ల వానలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో రాష్ట్రంలో ఎండలు కూడా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.