తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు గుడ్న్యూస్ చెప్పారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. శనివారం హైదరాబాద్లో భారీ వర్షం కురవడంతో నగరవాసులు ఉపశమనం పొందారు. అప్పటి వరకు ఎండలు దంచికొట్టగా.. ఉన్నట్లుండి వాతావరణం చల్లబడి వర్షం కురిసింది.