తెలంగాణలోని పలు జిల్లాల్లో నేటి నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. నైరుతి బలపడటం, బంగాళాఖాతంలో ఆవర్తనం కారణంగా పలు జిల్లాల్లో జోరుగా వానలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు హైదరాబాద్ నగంరలోనూ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు.