తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. నేటి నుంచి ఈనెల 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ వంటి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని.. దీనివల్ల వేసవి తాపం నుంచి ఉపశమనం లభించనుందని అధికారులు వెల్లడించారు.