హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు వర్ష సూచన జారీ చేసింది. రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదివారం కురిసిన వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం కాగా.. ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాల వల్ల ముగ్గురు వ్యక్తులు నాలాల్లో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. ఈ ఘటన వారి కుటుంబాల్లో విషాదం నింపింది.