తెలంగాణలో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్ కళ్యాణ్.. ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇప్పటికే హైదరాబాద్లో జనసేన పార్టీ కార్యాలయం ఉండగా.. తాజాగా మరో కొత్త పార్టీ ఆఫీస్ను ప్రారంభించనున్నారు. తెలంగాణలో జనసేనను బలోపేతం చేయడంలో భాగంగా మణికొండలో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. ఇక రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన బరిలో ఉంటామని ప్రకటించిన పవన్.. కసరత్తు మొదలుపెట్టారు.