తెలంగాణలో కొత్తగా నిర్మించ తలపెట్టిన వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్లో ప్రసంగిస్తూ.. ఈ రెండు విమానాశ్రయాల నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని ప్రకటించారు. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్టు మాత్రమే అందుబాటులో ఉన్నందున.. రాష్ట్ర అభివృద్ధి కోసం కొత్త ఎయిర్పోర్టులు అవసరమని కేంద్రంతో చర్చల ద్వారా వాటికి అనుమతులు లభించాయని సీఎం తెలిపారు.