తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మెున్నటి వరకు ఎండలు దంచికొట్టగా.. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు పడుతుండగా.. రాబోయే 4 రోజులు ఈ వర్షాలు ఉంటాయన్నారు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.