తెలంగాణలో మరో హైవే విస్తరణకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో దౌండ్-కోరాపుట్ జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.3,850 కోట్లతో ఆర్మూర్-మంచిర్యాల మధ్య 131.8 కిలోమీటర్ల రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఈ రహదారి విస్తరణతో ప్రయాణికులకు సౌకర్యంగా ఉండటంతో పాటు భూముల ధరలు పెరగనున్నాయి.