లంబాడా, బంజారా, సుగాలీలను గిరిజన వర్గాలుగా గుర్తించడం చట్టవిరుద్ధమని పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ అంశంపై కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసి పూర్తి వివరాలు కోరింది. దీనిపై మీ సమగ్ర వివరాలను సమర్పించాలని గడువు విధించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. వీరి వల్ల తెలంగాణలో నిజమైన గిరిజనులకు అన్యాయం జరుగుతుందని పిటిషనర్లు కోర్టులో వాదించారు. సెప్టెంబర్ 9న తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది.