ఎట్టకేలకు ఆ రైల్వే స్టేషన్కు హాల్టింగ్ అవకాశం దక్కింది. ఐదేళ్ల నుంచి పోరాడుతుండగా.. తాజాగా రైల్వే శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. దీంతో అక్కడి ప్రజలు, నాయకులు మోదీ చిత్రపటానికి, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇక ఈ స్టేషన్ లో మూడు రైళ్లు ఆగనున్నాయి. అందులో ఒకటి కోయంబత్తూర్–లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్, రెండోది.. ముంబై–చెన్నై ఎక్స్ప్రెస్, మూడోది చెన్నై–ముంబై ఎక్స్ప్రెస్. ప్రతీ రోజు ఈ రైల్వే స్టేషన్లో ఈ రైళ్లు ఆగనున్నాయి.