తెలంగాణలో ఇక నుంచి టెన్త్ పరీక్షలను తొలగించనున్నట్లు తెలుస్తోంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానంలో విద్యా బోధన జరగనున్నట్లు సమాచారం. తెలంగాణ విద్యా వ్యవస్థలో పూర్తిగా మార్పులు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన అధ్యయనం జరుగుతోందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.