తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు నిర్వహించనున్నారు. అదే సమయంలో ప్రజా ప్రతినిధులకు సాంస్కృతి కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. ఈ నెల 28, 29 రోజుల్లో ఈ ఆటల పోటీలు ఎల్బీ స్టేడియంలో.. సాంస్కృతిక కార్యక్రమాలను రవీంద్ర భారతిలో నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని కూడా ఏర్పాటు చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆటల పోటీలు ఇదే తొలిసారి కావడం విశేషం.