ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నేతలు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల రిజల్ట్పై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాహుల్ గాంధీపై వేసిన సెటైర్లకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణలో ఎలా పుంజుకున్నామో.. దేశవ్యాప్తంగా కూడా అలాగే గెలుస్తామని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.