తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. లంచం ఇస్తూ రేవంత్ రెడ్ రూ.50 లక్షల బ్యాగుతో హ్యాండెడ్గా దొరికారని విమర్శించారు. ఆయన దెబ్బకు తెలంగాణలో ఎవరైనా బ్యాగ్ కొనాలంటే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. హైదరాబాద్ ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్పై కేసు నమోదు చేయటాన్ని ఆర్ఎస్పీ ఖండించారు. ఇది రాజకీయ కుట్రలో భాగమని అన్నారు.