భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) చెపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బిహార్లో పూర్తి అయింది. ఆ తర్వాత విడతలో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఎస్ఐఆర్ పూర్తి చేసి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ను విడుదల చేసింది ఎన్నికల సంఘం. తర్వాత విడతలో తెలంగాణలో ఎస్ఐఆర్ జరుగనుందని తెలుస్తోంది. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తైన తర్వనాత హైదరాబాద్లో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.