తెలంగాణలో కొత్త విమానాశ్రయాల అభివృద్ధికి కీలక అడుగులు పడుతున్నాయి. వరంగల్ మామునూరు విమానాశ్రయానికి నిధుల మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కోరారు. ఇప్పటికే మామునూరు బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఎయిర్పోర్టు నిర్మాణం వేగవతం చేసేందుకు నిధులు విడుదల చేయాలని కోరారు. కాగా, భూసేకరణ అడ్డంకులు తొలగగానే నిధులు విడుదల చేసి, నిర్మాణం వేగవంతం చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.