తెలంగాణలోని ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. భారత వాయుసేన, పౌర విమానయాన అవసరాల కోసం ఉమ్మడి ఎయిర్ఫీల్డ్గా దీనిని అభివృద్ధి చేయనున్నారు. 950 ఎకరాల్లో నిర్మించనున్న ఈ విమానాశ్రయంలో A320 ఎయిర్బస్ విమానాలు రాకపోకలు సాగించేందుకు రన్వేతో పాటు అత్యాధునిక వసతులు కల్పిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆదిలాబాద్ ప్రాంత ఆర్థికాభివృద్ధికి, పర్యాటక రంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.