తెలంగాణలో కొత్తగా నిర్మించబోయే నేషనల్ హైవేలకు భూసేకరణ పెద్ద తలనొప్పిగా మారింది. టెండర్లు పూర్తయినా.. కొన్ని చోట్ల భూములు దక్కక పనులు ఆగిపోతున్నాయి. సీఎం ఆదేశించినా, కలెక్టర్లు వేగంగా స్పందించడం లేదని తెలుస్తోంది. పరిహారం, మార్గం మార్పు, విద్యుత్ లైన్లు, అటవీ అనుమతులు వంటి సమస్యలతో ప్రాజెక్టులు ఆలస్యమై, ఖర్చు పెరిగిపోతోంది.