తెలంగాణలో రహదారుల అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో 2,722 కి.మీ కొత్త జాతీయ రహదారులు నిర్మించినట్లు చెప్పారు. మరో 2,526 కి.మీ రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ అవుతున్నాయన్నారు. భారతమాల పరియోజన కింద 1,719 కి.మీ నేషనల్ హైవేల కోసం రూ.38,297 కోట్లు కేటాయించినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.