ములుగు జిల్లా గట్టమ్మ గుట్ట వద్ద.. రూ. 24 కోట్లతో 8.4 కి.మీ. పొడవైన ప్రహరీ గోడ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్థానిక యువతకు ఉన్నత విద్యావకాశాలు కల్పిస్తుందని.. విద్యారంగంలో కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నారు. యూనివర్సిటీలో 80 శాతం ప్రవేశాలు స్థానిక విద్యార్థులకే దక్కుతాయని ఎంపీ బలరాం నాయక్ తెలిపారు. ఇది గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షిస్తూ.. ప్రాంతీయ ప్రతిభను ప్రోత్సహించేందుకు బలమైన వేదిక అవుతుందని నేతలు అభిప్రాయపడ్డారు.