తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ ఇలా ప్రారంభమైందో లేదో.. అప్పుడే బ్రేకులు పడ్డాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో.. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు సిద్ధమైన ప్రజలు తీవ్ర ఆందోళనకు, అయోమయానికి గురయ్యారు. కాగా.. ఈ వార్తలపై ఈసీఐ స్వయంగా స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.