తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ 2025 నూతన రేషన్ కార్డుల మార్గదర్శకాలు విడుదల చేసింది. మెహదీపట్నం సర్కిల్ అధికారిణి బుష్రా సుల్తానా వివరాలు తెలియజేశారు. అర్హులైన వారు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు రుసుము రూ. 45 చెల్లించాలి. అధికారులు ఇంటికి వచ్చి పరిశీలన చేస్తారు. ఆధార్ కార్డు, విద్యుత్ బిల్లు వంటి పత్రాలు సమర్పించాలి. ప్రజలు భయాందోళన చెందవద్దని, సిబ్బంది అందుబాటులో ఉంటారని బుష్రా సుల్తానా తెలిపారు.