తెలంగాణలో కొత్త రైల్వే లైన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే మార్గం పనులు వేగవంతమయ్యాయి. 151 కి.మీ.ల ఈ ప్రాజెక్టుకు రూ. 1400 కోట్లు కేటాయించారు. కరీంనగర్- సికింద్రాబాద్ మధ్య ప్రయాణికులకు ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. 2027 నాటికి రైలు పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే, భూసేకరణ సమయంలో పరిహారం విషయంలో రైతుల అభ్యంతరాలు ప్రాజెక్టుకు సవాలుగా నిలిచాయి. కేంద్రం రూ. 200 కోట్లు కేటాయించడంతో పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.