తెలంగాణ రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్. రాష్ట్రంలో మరో రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. వికారాబాద్-కృష్ణాల మధ్య రైల్వే లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్సభలో వెల్లడించారు. ట్రైన్ లైన్ వెళ్లే ఆయా ప్రాంతాలను సైతం వెల్లడించారు. ఇప్పటికే సర్వే పూర్తయిందని.. నిర్మాణం విషయంలో నెలకొన్ని సందిగ్ధత పూర్తయ్యాక పనులు మెుదలుపెట్టనున్నట్లు చెప్పారు.