తెలంగాణ ప్రజలకు కేంద్రం తీపి కబురు చెప్పింది. త్వరలోనే మరో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. డోర్నకల్-గద్వాల మధ్య 296 కి.మీ కొత్త రైల్వే లైన్ సర్వే పూర్తయిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ ట్రైన్ లైన్ సూర్యాపేట, నల్గొండ మీదుగా సాగుతుందని తెలిపారు. జడ్చర్ల-నంద్యాల లైన్ సర్వే కూడా పూర్తయిందని.. 'అమృత్ భారత్' కింద ఎంపికైన 40 స్టేషన్లలో 6 స్టేషన్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. భూసేకరణ సమస్యల వల్ల కొన్ని ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నా.. పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరగా పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.